Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : *తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* ఖమ్మం తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కార్యదర్శి భానోత్ జగన్ అధ్యక్షతన స్థానిక గిరి ప్రసాద్ భవన్ లో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా నిర్మాణ బాధ్యలు సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా గారు హాజరవడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు మంజూరి చేయాలి అలాగే ST SC సబ్ ప్లాన్ సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని అలాగే బాల బాలికలకు హాస్టల్ వసతులు కల్పించాలని తండాలలో గూడలో ఇందిరమ్మ ఇళ్ళను పూర్తిస్థాయిలో అమలు చేయాలని వారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర రామ్మూర్తినాయక్ గారు మాట్లాడుతూ చేవెళ్ల డిక్లరేషనలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సమావేశంలో జిల్లా నాయకులు బానోతు రామకోటి,బోడ ఈరన్న బానోత్,రాంబాబు,బానోత్ రామ్మూర్తి భూక్యా నరసింహ బోడా చిన తదితరులు పాల్గొనడం జరిగింది
Admin
Mana Mahati News