Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : అన్ని మతాల ప్రజలు ఒకే కుటుంబంలా ఉండాలి గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ మసీదుకు సైరన్ బహుకరించిన సర్పంచ్ భాగ్యమ్మ మజీద్ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్కు, ఉపసర్పంచ్ కు శాలువాతో సన్మానం గ్రామంలో అన్ని మతాల ప్రజలు ఒకే కుటుంబంలా ఉండాలనీ కొత్తగూడ గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ అన్నారు.గురువారం రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులు ఆచరించే ఉపవాస దీక్షలకు సమయ అలర్ట్ అందించాలనే సదుద్దేశంతో కొత్తగూడ మండల కేంద్రంలోని మజీద్ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మత పెద్దల సమక్షంలో మల్లెల భాగ్యమ్మ కొత్తగూడ మజీద్కు సైరాన్ను బహుకరించారు.ఈ సందర్బంగా మల్లెల భాగ్యమ్మ మాట్లాడుతూ...రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ప్రతిరోజూ ఉదయం సహరి సమయానికి మేల్కొనడం, సాయంత్రం ఇఫ్తార్ సమయంలో ఉపవాసం విరమించడం జరుగుతుందని, ఆ వేళలను సరిగ్గా గుర్తు చేసేందుకు ఈ సైరన్ ఎంతో ఉపయోగపడుతుందని సైరన్ ద్వారా సమయపాలన సులభతరం అవుతుందని రంజాన్ మాసం సహనం, దానధర్మం, మానవత్వానికి ప్రతీక. మన గ్రామంలో కులమతాలకు అతీతంగా అందరూ ఒక కుటుంబంలా ఉండాలి. ఒకరి పండుగలో మరొకరు భాగస్వాములు కావడమే నిజమైన ఐక్యత అని అన్నారు.అనంతరం మజీద్ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ మల్లెల భాగ్యమ్మను , ఉపసర్పంచ్ కంగాల రాజశేఖర్ కు శాలువాతో సత్కారించి ముస్లిం సోదరుల అవసరాన్ని గుర్తించి సైరన్ బహుకరించడం అభినందనీయం. మతభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తున్న సర్పంచ్కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీద్ కమిటీ అధ్యక్షులు అజ్మీర్,మత గురువు ముద్దసిర్,మతపెద్దలు యాకుబ్ పాషా లు, మాజీ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్,సద్దాం,బిరుదు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News