Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : మెడ్చల్–మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని నారపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు ( NLEP) జాతీయ కుష్ఠు వ్యాధి నిర్ములన కార్యక్రమం పై అవగాహనా కార్యక్రమం 30-01-2026 న గాంధీ గారి చిత్రపటానికి పూలమాల అలంకరించడం తో ప్రారంభించి విజయవంతంగా నిర్వహించబడినది. ఈ సంవత్సరం " వివక్షతను అంతం చేయడం -గౌరవాన్ని నిర్దారించడం "అనే ప్రధాన అంశం తో ఈ కార్యక్రమం ద్వారా కుష్ఠు వ్యాధి పై 30-1-2026 నుండి 13-02-2026 వరకు ఈ అవగాహనా కార్యక్రమాలు స్కూల్స్ లో కాలేజీ లో నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడం జరిగినది ప్రజలు ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని Dr. శ్రీదేవి ప్రోగ్రాం అధికారి విజ్ఞప్తి చేయడం జరిగినది. ఈ సందర్బంగా విజయవంతం గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి లెప్రసీ పేషంట్ ని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో Dr శ్రీదేవి ప్రోగ్రాం అధికారి, Dr సత్యవతి డిప్యూటీ DM&HO,Dr శోభన, phc మెడికల్ ఆఫీసర్,సింహారాజు, DPMO, పల్లెదావాఖనా డాక్టర్స్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ లు పాల్గొనడం జరిగినది — జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ మెడ్చల్–మల్కాజ్గిరి జిల్లా
Admin
Mana Mahati News