Monday, 27 July 2026 07:39:13 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలంతో పాటు గృహాలు మంజూరు చేయాలి

Date : 18 January 2026 09:37 PM Views : 168

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలంతో పాటు గృహాలు మంజూరు చేయాలి తెలంగాణ మాల జర్నలిస్టుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేతమల్ల సహాదేవ్ డిమాండ్ కురవి జనవరి18( నివాస్ న్యూస్): జిల్లాలో పని చేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ గృహాలు ఇవ్వాలని తెలంగాణ మాల జర్నలిస్టుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేతమల్ల సహాదేవ్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో గత కొన్నేళ్లుగా వివిధ పత్రికలు, చానళ్లలో రిపోర్టర్లుగా ఉన్నవారు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తున్నారని తెలిపారు. వీరిలో చాలా మందివి పేద కుటుంబాలేనని, సొంత ఇల్లు లేక అద్దెకు ఉంటూ దుర్భరజీవితం గడుపుతూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, నివేశన స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీ మేరకు జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి, వెంటనే నివేశన స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డోర్నకల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలుస్తే కురవి మండలంలో పనిచేస్తున్న కొందరికి కాకుండా జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలంతో పాటు ఇందిరమ్మ గృహాలు ఇస్తానని శ్రీ వీరభద్ర స్వామి సాక్షిగా ప్రస్తుత ఎమ్మెల్యే రామచంద్రనాయక్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా హామీ అమలు చేయాలని సహాదేవ్ కోరారు. లేదంటే జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :