Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *త్వరలో ఏపీ లో 2,500 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్!* ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ జనవరి 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవు తోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణ ప్రక్రియపై అధికా రులు కసరత్తు చేస్తున్నారు. అధికార వర్గాల సమాచా రం ప్రకారం.. ఫిబ్రవరి నెలలోనే సుమారు 2,500 ఉపాధ్యా య పోస్టుల భర్తీకి నోటిఫి కేషన్ త్వరలోనే జారీ చేయనుంది... ఈసారి డీఎస్సీలో కొత్తగా ఇంగ్లీష్ ప్రావీణ్యం, కంప్యూ టర్పై అవగాహనకు సంబంధించి ఒక పేపర్గా ఎగ్జామ్ నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. డీఎస్సీతోపాటే కొత్త పేపర్ పరీక్ష జరుగుతుందని అధి కార వర్గాలు తెలిపాయి. అయితే, ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది. విద్యా వ్యవస్థను ఆధునీ కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఆ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ సారథ్యంలో అధికా రులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. బోధన నాణ్యతపై దీని ప్రభావం పడుతోందని విద్యాశాఖ అంచనాకు వచ్చింది. మరోవైపు ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు ప
Admin
Mana Mahati News